ఎక్స్పో 2020కి కృత్రిమ మేథ‌స్సు భ‌ద్ర‌త‌

- September 19, 2021 , by Maagulf
ఎక్స్పో 2020కి కృత్రిమ మేథ‌స్సు భ‌ద్ర‌త‌

దుబాయ్: ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఎక్స్ పో 2020 ఈవెంట్ భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌ను అధికారులు స‌మీక్షించారు. భ‌ద్ర‌త బ‌ల‌గాల‌తో పాటు...కృత్రిమ మేథ‌స్సును స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకొని ఎక్స్ పో 2020కి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త అందించనున్న‌ట్లు  దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. ఎక్స్ పో కోసం దేశానికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు ఈవెంట్ ప్రాంగ‌ణానికి సుర‌క్షితంగా చేరుకునే వ‌ర‌కు వారికి భ‌ద్ర‌త క‌ల్పించ‌టం త‌మ ముందున్న ప్రధాన ల‌క్ష్య‌మ‌న్నారు. దుబాయ్ స్మార్ట్ సిస్టం ప‌నితీరుకు ప్ర‌తిబింబించేలా త‌మ భ‌ద్ర‌త చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com