స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్
- September 20, 2021ఒమన్: కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ..తాజా క్రీడాప్రియులకు కూడా శుభవార్త అందించింది. దేశంలో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో ఏదైన ఒక వ్యాక్సిన్ను కనీసం సింగిల్ డోస్ అయిన తీసుకున్న వారినే అనుమతించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈవెంట్ వేదిక సామర్ధ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని తెలిపింది.
ఇదిలా ఉంటే...ఇరాన్, ఇరాక్ నుంచి ఒమన్ వచ్చే వారికి సంబంధించి క్వారంటైన్ నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ప్రయాణికులను సెప్టెంబర్ 1 నుంచే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినా..ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చే వారు మాత్రం క్వారంటైన్ లో ఉండాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా నిబంధనలను సడలిస్తూ ఇతర దేశాల ప్రయాణికులకు వర్తించిన నిబంధనలే ఈ రెండు దేశాలకు కూడా వర్తిస్తాయని ఒమన్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..