300 దిర్హాముల ప్రత్యేక ఛార్జీలతో ఇండియాకి ఎయిర్ అరేబియా విమానాలు
- September 20, 2021యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్ సంస్థ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. 300 దిర్హాముల నుంచి 600 దిర్హాముల మధ్య వన్ వే టిక్కెట్ ధరల వుండేలా 11 భారతీయ నగరాలకు కొత్త స్కీమ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ మరియు కోచిలకు 300 దిర్హాములతో వెళ్ళవచ్చు. కాలికట్ మరియు చెన్నై నగరాలకు 310 దిర్హాములతో వెళ్ళవచ్చు. త్రివేండ్రమ్ 320 దిర్హాములతో, అహ్మదాబాద్ 350 దిర్హాములతో, కోయంబత్తూర్ 398 దిర్హాములతో, బెంగళూరు 450 దిర్హాములతో, గోవా 600 దిర్హాములతో వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. కాగా, యూఏఈ వచ్చే ప్రయాణీకులు (ఇండియా, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక నుంచి ఇ వీసా ద్వారా వచ్చేవారు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్ రికార్డులను (షార్జా మరియు రాస్ అల్ ఖైమాలకు ప్రయాణిస్తే) చూపించాల్సి వుంటుంది. ప్రయాణానికి ముందు ఐసీఏ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!