ముహరాక్ ఐడెంటిటీ కార్డ్ సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం
- September 24, 2021
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ గవర్నమెంట్ అథారిటీ (iGA), ముహరాక్లోని సీఫ్ మాల్లోగల ఐడీ కార్డు సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం అవుతుందని, ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపింది. అన్ని ఐడీ కార్డు సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తిగతంగా హాజరు అవ్వాలనుకోనివారి కోసం ఆన్లైన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. ఈ కేంద్రాన్ని సందర్శించాలనుకునేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది వెబ్సైట్ ద్వారా. కరోనా నిబంధనల్ని తప్పక పాటించాలి. సేవల విషయమై సూచనల్ని అందించవచ్చు. పౌరులు అలాగే నివాసితులు ఈ కేంద్రం వద్ద సేవల్ని పొందవచ్చు. ఐడీ కార్డు జారీ, రెన్యువల్స్, పాడైపోయిన లేదా పోగొట్టుకున్న కార్డుల్ని తిరిగి పొందడం వంటి వాటి కోసం ఈ కేంద్రాన్ని సందర్శించవచ్చు. వినియోగదారులు తమ ఐడీ కార్డు చిప్ డిటెయిల్స్ని ఈ కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









