టిఓఐఎఫ్ఎ ఫిలిం అవార్డ్స్ కోసం స్పెషల్ ఆర్టిఎ బస్సులు
- March 17, 2016
రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి ప్రత్యేక బస్సులను నడపనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ (టిఓఐఎఫ్ఎ) ప్రోగ్రామ్ సందర్భంగా ఈ ఏర్పాట్లను ఆర్టిఎ చేసింది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ నుంచి 25 బస్సుల్ని ఇందుకోసం వినియోగించనుంది. డేరా సిటీ సెంటర్, మరీనా మాల్, అల్ ఘుబైబా బస్ స్టేషన్, బుర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. యూఏఈ వ్యాప్తంగా పెద్దయెత్తున టిఓఐఎఫ్ఎకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. షారుక్ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్వీర్సింగ్, రితేష్ దేశ్ముఖ్, పరిణీతి చోప్రా తదితరులు రెడ్ కార్పెట్పై సందడి చేయనున్నారు. షారుక్, సల్మాన్, కరీనాకపూర్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ సహా పలువురు ప్రముఖులు తమ పెర్ఫామెన్స్లతో దుబాయ్ వాసుల్ని అలరించనున్నారు. టిఓఐఎఫ్ఎ 2016 అవార్డుల కార్యక్రమానికి టిక్కెట్ల ధరలు 199 దిర్హామ్ల నుంచి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







