ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వందలాది మంది అరెస్ట్
- October 11, 2021కువైట్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇటీవల ట్రాఫిక్ వాయలేషన్స్ అతిగా జరుగుతుండటంతో ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులుగా వాహనాల తనిఖీలు స్టార్ట్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 3506 మంది ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడినట్లు గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. 19 వాహనాలు జప్తు చేశారని అల్ అంబా పత్రిక రిపోర్ట్ లో తెలిపింది. 27 మంది జువైనల్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జువైనల్స్ వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ జువైనల్ హోమ్స్ కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు