భారత్లో మరో ప్రైవేట్ ఎయిర్లైన్స్కు గ్రీన్ సిగ్నల్
- October 12, 2021
న్యూఢిల్లీ: 'ఆకాశ ఎయిర్'కు కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. పౌర విమానయాన శాఖ 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి)' జారీ చేసినట్లు కంపెనీ ఆకాశ ఎయిర్ వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది వేసవి నాటికి విమాన యాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించవచ్చని బిలయనీర్ రాకేష్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. ఎన్ఒసి జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు' అని ఆకాశ ఎయిర్ సిఇఒ వినరు దూబే ట్వీట్ చేశారు. దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆకాశ ఎయిర్ బోర్డ్ సభ్యుల్లో ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు.వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలు నడిపేందుకు ఆకాశా ఎయిర్ సంస్థ ప్లాన్ చేస్తున్నది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









