భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

- October 12, 2021 , by Maagulf
భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ: 'ఆకాశ ఎయిర్‌'కు కేంద్రం గ్రీన్‌ సిగ్నలిచ్చింది. పౌర విమానయాన శాఖ 'నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఒసి)' జారీ చేసినట్లు కంపెనీ ఆకాశ ఎయిర్‌ వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది వేసవి నాటికి విమాన యాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించవచ్చని బిలయనీర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. ఎన్‌ఒసి జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు' అని ఆకాశ ఎయిర్‌ సిఇఒ వినరు దూబే ట్వీట్‌ చేశారు. దూబే గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆకాశ ఎయిర్‌ బోర్డ్‌ సభ్యుల్లో ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ కూడా ఉన్నారు.వ‌చ్చే నాలుగేళ్లలో 70 విమానాలు న‌డిపేందుకు ఆకాశా ఎయిర్ సంస్థ ప్లాన్ చేస్తున్న‌ది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com