బోల్తా పడిన పాఠశాల వ్యాన్ భారతీయ బాలుడు మృతి, ఏడుగురికి గాయాలు
- March 18, 2016
దోహాలో మలుపు తిరుగుతూ బోల్తా పడిన ఓ కిండర్ గార్డెన్ వ్యాన్ ప్రమాదంలో ముక్కుపచ్చలారని ఒక భారతీయ బాలుడు అక్కడక్కడే మృతి చెందగా మరో 7 గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం హిలాల్ ప్రాంతంలో సర్వోదయ కిండర్ గార్టెన్ కు చెందిన వ్యాన్ లో మొత్తం 13 విద్యార్ధులు పాఠశాల నుంచి ఇళ్ళకు తిరిగి వెళుతుండగా హొమీఅర్ల్య్ మలుపు వద్ద వ్యాన్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐడెన్ షాజీ వర్గిస్ ( 5 ) అనే బాలుడు దుర్మరణం చెందాడు. అలాగే సుడాన్ దేశానికి చెందిన ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. చనిపోయిన చిన్నారి తండ్రి షాజీ వర్గిస్ కతార్ విమానయాన సంస్థ ఉద్యోగి అతని భార్య రీనా మాథ్యూ రుమైలః ఆసుపత్రితో నర్సుగా పని చేస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా,అయిదేళ్ళ క్రితం దోహాలో ఐడెన్ షాజీ వర్గిస్ వీరికి జన్మించాడు. భారతదేశంలో కేరళ రాష్ట్రం తిరువల్ల జిల్లా కురిశుమ్మూట్టి హౌస్ ప్రాంతానికి చెందిన వీరికి లేక లేక జన్మించిన అతడొక్కడే కుమారుడు కావడంతో ఆ దంపతుల శోకాన్నిఎవరు అదుపు చేయలేకపోతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన వ్యాన్ లో ఒక సహాయక మహిళ కూడా ఉంది .వీరందరు చిన్న గాయాలపాలతో మృత్యుపాశం నుంచి తప్పుకొన్నారు. స్వల్ప గాయాలయిన వ్యాన్ డ్రైవర్ ను ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పోలీసులు ప్రశ్నిస్తున్నారు
తాజా వార్తలు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!









