తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 14, 2021నిజామాబాదు: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి ప్రారంభమైంది.తెలంగాణ నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామములో ఘనంగా జరుపుకున్నారు.
ఇప్పటికే పట్నం వాసులు పల్లెటూర్లకి చేరుకున్నారు.ఆడపడచుల రాకతో ప్రతిఇంటా కోలాహలం మొదలైంది. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ సందడి సందడిగా మారాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ నిర్వహిస్తారు.రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు.రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..