యాక్టివ్ కోవిడ్ 19 కేసులతో కాంటాక్ట్ ఉన్నవారికి గ్రీన్ షీల్డ్ వుంటే క్వారంటైన్ అవసరం లేదు
- October 14, 2021మనామా: గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది క్వారంటైన్ విషయమై. కోవిడ్ 19 యాక్టివ్ కేసులతో కాంటాక్ట్ వున్నవారికి గ్రీన్ షీల్డ్ గనుక వుంటే, వారికి క్వారంటైన్ అవసరం లేదు. ఈ వెసులుబాటు 15 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే గ్రీన్ షీల్డ్ లేకుండా కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు కాంటాక్ట్ వుంటే మాత్రం తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి. గతంలో ఇది 10 రోజులుగా వుండేది. క్వారంటైన్ మొదటి రోజున అలాగే ఏడవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పొందిన లేదా కరోనా నుంచి కోలుకున్నవారికి కోవిడ్ 19 కాంటాక్టు వున్నా వారికి క్వారంటైన్ అవసరం వుండదు. అయితే వారు తొలి రోజులు అలాగే ఏడవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ సంబంధిత సమస్యలేమైనా వుంటే అదనంగా మరో టెస్ట్ అవసరమవుతుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం