దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్‌

- March 18, 2016 , by Maagulf
దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్‌

 ఐసిసి వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్‌కు ముందు హాట్‌ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలయిన టీమిండియాకు శనివారం ఇక్కడ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను ఢీకొనబోతోంది. సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య జరిగే అన్ని పోటీల్లాగానే ఈ మ్యాచ్ కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వాస్తవానికి ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు మార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com