కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి: WHO
- October 22, 2021జెనీవా: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు WHO తాజాగా వెల్లడించింది.ఆరోగ్య కార్యకర్తలకు తొలుత కోవిడ్ వ్యాక్సిన్ లను ఇవ్వాలని WHO చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల పంపిణీలో జరుగుతున్న అసమానతలను ఆయన తప్పుపట్టారు.
గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు కోవిడ్పై పోరాటంలో హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల జాప్యం వల్ల కరోనా వచ్చే ఏడాది కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు మరో WHO అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. అయితే 119 దేశాలకు చెందిన డేటా ప్రకారం.. ప్రతి అయిదుగురిలో ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
ఆఫ్రికాలో పది మందిలో, ఒక హెల్త్వర్కర్ మాత్రమే వ్యాక్సినేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఇక సంపన్న దేశాల్లో పది మందిలో.. 8 మంది వ్యాక్సిన్ లు వేయించుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవలం 5 శాతం జనాభా మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!