కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి: WHO
- October 22, 2021జెనీవా: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు WHO తాజాగా వెల్లడించింది.ఆరోగ్య కార్యకర్తలకు తొలుత కోవిడ్ వ్యాక్సిన్ లను ఇవ్వాలని WHO చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల పంపిణీలో జరుగుతున్న అసమానతలను ఆయన తప్పుపట్టారు.
గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు కోవిడ్పై పోరాటంలో హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల జాప్యం వల్ల కరోనా వచ్చే ఏడాది కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు మరో WHO అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. అయితే 119 దేశాలకు చెందిన డేటా ప్రకారం.. ప్రతి అయిదుగురిలో ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
ఆఫ్రికాలో పది మందిలో, ఒక హెల్త్వర్కర్ మాత్రమే వ్యాక్సినేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఇక సంపన్న దేశాల్లో పది మందిలో.. 8 మంది వ్యాక్సిన్ లు వేయించుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవలం 5 శాతం జనాభా మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14