కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి: WHO
- October 22, 2021
జెనీవా: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు WHO తాజాగా వెల్లడించింది.ఆరోగ్య కార్యకర్తలకు తొలుత కోవిడ్ వ్యాక్సిన్ లను ఇవ్వాలని WHO చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల పంపిణీలో జరుగుతున్న అసమానతలను ఆయన తప్పుపట్టారు.
గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు కోవిడ్పై పోరాటంలో హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల జాప్యం వల్ల కరోనా వచ్చే ఏడాది కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు మరో WHO అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. అయితే 119 దేశాలకు చెందిన డేటా ప్రకారం.. ప్రతి అయిదుగురిలో ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
ఆఫ్రికాలో పది మందిలో, ఒక హెల్త్వర్కర్ మాత్రమే వ్యాక్సినేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఇక సంపన్న దేశాల్లో పది మందిలో.. 8 మంది వ్యాక్సిన్ లు వేయించుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవలం 5 శాతం జనాభా మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









