ఒమన్ ఖర్జూర పండ్ల అమ్మకాలకు ప్రత్యేక స్టోర్లు
- October 24, 2021
ఒమన్: ఒమన్ ఖర్జూర పండ్లకు ఉన్న ప్రత్యేకత తెలిసిందే. అత్యంత క్వాలిటీగా ఉండే ఈ పండ్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒమని డేట్స్ పేరుతో ఒమన్ అవెన్యూ మాల్ లో స్పెషల్ అవుట్ లెట్స్ ను స్టార్ట్ చేశారు. అదే విధంగా ఖర్జూర రైతులు, మార్కెటింగ్ చేసే వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి సల్తానటే లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లోనూ ప్రత్యేక స్టాల్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో డేట్స్ నట్స్, ఖర్జురా జ్యూస్, వెనిగర్ ప్రాడెక్ట్ లను ప్రదర్శనకు పెట్టారు. అక్టోబర్ 31 వరకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఒమని డేట్స్ పండించే రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని నెలలుగా కృషి చేస్తున్నారు. ఒమని డేట్స్ ప్రత్యేకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







