దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు
- October 26, 2021
దుబాయ్ : ఓ గ్రాసరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు ప్రవాసులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులపై అభియోగాలు రుజువుకావటంతో వారికి ఏడాది పాటు జైలుశిక్ష 1700 దిర్హామ్స్ ఫైన్ వేసింది. జైలుశిక్ష పూర్తైన తర్వాత దోషులందరినీ దేశం నుంచి తిరిగి పంపించేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే గతేడాది అక్టోబర్ లో ఓ గ్రాసరీ షాప్ లో ముగ్గురు ఏషియాకు చెందిన ప్రవాసులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓనర్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరికీ శిక్షపడింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







