3-11 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. సినోఫార్మ్ వ్యాక్సిన్కు ఆమోదం
- October 27, 2021
బహ్రెయిన్: 3-11 ఏళ్ల వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సినోఫార్మ్ కోవిడ్-19 వ్యాక్సిన్కు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. దీంతో 3 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సినోఫార్మ్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. వ్యాక్సిన్ కమిటీ నిర్వహించిన మెడికల్ హెల్త్ అండ్ భద్రతా సిఫార్సులను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు Pfizer-BioNTech వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లేదా BeAware యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరెంట్స్/గార్డియన్ అనుమతి తప్పనిసరి అని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. పిల్లలు టీకాలు తీసుకునేటప్పుడు వారితో పాటు పెద్దలు కూడా ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









