3-11 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. సినోఫార్మ్ వ్యాక్సిన్కు ఆమోదం
- October 27, 2021
బహ్రెయిన్: 3-11 ఏళ్ల వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సినోఫార్మ్ కోవిడ్-19 వ్యాక్సిన్కు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. దీంతో 3 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సినోఫార్మ్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. వ్యాక్సిన్ కమిటీ నిర్వహించిన మెడికల్ హెల్త్ అండ్ భద్రతా సిఫార్సులను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు Pfizer-BioNTech వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లేదా BeAware యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరెంట్స్/గార్డియన్ అనుమతి తప్పనిసరి అని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. పిల్లలు టీకాలు తీసుకునేటప్పుడు వారితో పాటు పెద్దలు కూడా ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







