‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!
- October 27, 2021హైదరాబాద్: సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమంటున్నారు దర్శకుడు మారుతీ.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్