దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్

- October 28, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్

దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 లో ఇండియన్ పెవిలియన్ దుమ్ము రేపుతోంది. ఇండియా ఏర్పాటు చేసిన పెవిలియన్ కు భారీగా విజటర్స్ వస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 25 తేదీ నాటికే దాదాపు లక్షా 28 వేల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శించారు. దీనిపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై ఎంతో ఆదరణ ఉందో నిరూపిస్తుందన్నారు. న్యూ ఇండియా పయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుంటున్నారని చెప్పారు. ఈ ఎక్స్ పో మరో 5 నెలలుగా కొనసాగనుంది. అప్పటి వరకు దాదాపు  8 నుంచి 10 లక్షల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో ను ఇప్పటి వరకు 15 లక్షల మంది విజిట్ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com