దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్
- October 28, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 లో ఇండియన్ పెవిలియన్ దుమ్ము రేపుతోంది. ఇండియా ఏర్పాటు చేసిన పెవిలియన్ కు భారీగా విజటర్స్ వస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 25 తేదీ నాటికే దాదాపు లక్షా 28 వేల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శించారు. దీనిపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై ఎంతో ఆదరణ ఉందో నిరూపిస్తుందన్నారు. న్యూ ఇండియా పయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుంటున్నారని చెప్పారు. ఈ ఎక్స్ పో మరో 5 నెలలుగా కొనసాగనుంది. అప్పటి వరకు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో ను ఇప్పటి వరకు 15 లక్షల మంది విజిట్ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







