దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్
- October 28, 2021దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 లో ఇండియన్ పెవిలియన్ దుమ్ము రేపుతోంది. ఇండియా ఏర్పాటు చేసిన పెవిలియన్ కు భారీగా విజటర్స్ వస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 25 తేదీ నాటికే దాదాపు లక్షా 28 వేల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శించారు. దీనిపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై ఎంతో ఆదరణ ఉందో నిరూపిస్తుందన్నారు. న్యూ ఇండియా పయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుంటున్నారని చెప్పారు. ఈ ఎక్స్ పో మరో 5 నెలలుగా కొనసాగనుంది. అప్పటి వరకు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో ను ఇప్పటి వరకు 15 లక్షల మంది విజిట్ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్