వ్యాక్సినేషన్ లెక్కల్లో గందరగోళం. క్లారిటీ ఇచ్చిన హెల్త్ మినిస్ట్రీ
- October 29, 2021
ఒమన్: వ్యాక్సినేషన్ లెక్కలో నెలకొన్న గందరగోళంపై ఒమన్ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్ లో దాదాపు పది లక్షల మంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా వారికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయలేదని స్థానిక లోకల్ రేడియోలో న్యూస్ వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఈ విషయం హెల్త్ మినిస్ట్రీ దృష్టికి వెళ్లటంతో అసలు లెక్కలను పూర్తి గణంకాలతో వివరించింది. పదిలక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 3,071,161 మంది కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. వీరిలో 94 శాతం మంది ఒమన్ కు చెందిన వారేనని ప్రకటించింది. అదే విధంగా రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు 87 శాతం ఉన్నట్లు లెక్కలతో సహా వివరించింది. ఇందులో 94 శాతం మంది ఒమన్ పౌరులేనని స్పష్టం చేసింది. దాదాపు 79 శాతం మందికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ లెక్కల్లో ప్రజలను కన్ ఫ్యూజ్ చేయవద్దని మీడియాకు సూచించింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









