వ్యాక్సినేషన్ లెక్కల్లో గందరగోళం. క్లారిటీ ఇచ్చిన హెల్త్ మినిస్ట్రీ

- October 29, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ లెక్కల్లో గందరగోళం. క్లారిటీ ఇచ్చిన హెల్త్ మినిస్ట్రీ

ఒమన్: వ్యాక్సినేషన్ లెక్కలో నెలకొన్న గందరగోళంపై ఒమన్ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్ లో దాదాపు పది లక్షల మంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా వారికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయలేదని స్థానిక లోకల్ రేడియోలో న్యూస్ వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఈ విషయం హెల్త్ మినిస్ట్రీ దృష్టికి వెళ్లటంతో అసలు లెక్కలను పూర్తి గణంకాలతో వివరించింది. పదిలక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 3,071,161 మంది కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. వీరిలో 94 శాతం మంది ఒమన్ కు చెందిన  వారేనని ప్రకటించింది. అదే విధంగా రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు 87 శాతం ఉన్నట్లు లెక్కలతో సహా వివరించింది. ఇందులో 94 శాతం మంది ఒమన్ పౌరులేనని స్పష్టం చేసింది. దాదాపు 79 శాతం మందికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ లెక్కల్లో ప్రజలను కన్ ఫ్యూజ్ చేయవద్దని మీడియాకు సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com