ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలుంటే నెలరోజుల్లోపు చెప్పొచ్చు
- October 29, 2021
అబుదాబి: ట్రాఫిక్ జరిమానాలపై నెలరోజుల్లోపు వాహనదారులు అభ్యంతరం చెప్పొచ్చని అబుదాబి పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఫైన్ కు సంబంధించిన SMS అందిన తేదీ నుండి ఒక నెలలోపు డ్రైవర్లు, వెహికిల్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ట్రాఫిక్ నియంత్రణ నియమాలు, విధానాలపై 2017 మంత్రివర్గ తీర్మానం నెం.178 ఆధారంగా.. వెహికిల్ ఓనర్/డ్రైవర్ తన వాహనంపై విధించిన జరిమానాలపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. వాహనదారుల అభ్యంతరాలను పరిశీలిస్తామని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు. "నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే వాహన యజమాని తప్పుగా జరిమానా విధించారని క్లెయిమ్ చేయవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందగానే సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారు. తప్పుగా ఫైన్ విధించి ఉంటే దాన్ని రద్దుచేస్తారు. లేదంటే ఉన్న ఫైన్ నే ఖరారు చేస్తారు." అని బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..