ట్రాఫిక్ జరిమానాలపై అభ్యంతరాలుంటే నెలరోజుల్లోపు చెప్పొచ్చు
- October 29, 2021
అబుదాబి: ట్రాఫిక్ జరిమానాలపై నెలరోజుల్లోపు వాహనదారులు అభ్యంతరం చెప్పొచ్చని అబుదాబి పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఫైన్ కు సంబంధించిన SMS అందిన తేదీ నుండి ఒక నెలలోపు డ్రైవర్లు, వెహికిల్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ట్రాఫిక్ నియంత్రణ నియమాలు, విధానాలపై 2017 మంత్రివర్గ తీర్మానం నెం.178 ఆధారంగా.. వెహికిల్ ఓనర్/డ్రైవర్ తన వాహనంపై విధించిన జరిమానాలపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. వాహనదారుల అభ్యంతరాలను పరిశీలిస్తామని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు. "నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే వాహన యజమాని తప్పుగా జరిమానా విధించారని క్లెయిమ్ చేయవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందగానే సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారు. తప్పుగా ఫైన్ విధించి ఉంటే దాన్ని రద్దుచేస్తారు. లేదంటే ఉన్న ఫైన్ నే ఖరారు చేస్తారు." అని బ్రిగేడియర్ మహమ్మద్ అల్ హుమైరీ చెప్పారు.
తాజా వార్తలు
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









