బహ్రెయిన్ రాజును కలిసిన షేక్ మహమ్మద్.. పలు కీలక అంశాలపై చర్చ
- October 29, 2021
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం అబుదాబిలో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో యూఏఈ, బహ్రెయిన్ మధ్య సంబంధాలను పెంపొందించడానికి.. రెండు దేశాల ప్రజలకు ఉపయోగపడేలా కొత్త అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని ఇరు దేశాల నేతలు కొనియాడారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సాధించిన పురోగతి, కోవిడ్ -19 కాలంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చేసిన ప్రయత్నాలపై కూడా ఇరు దేశాధినేతలు తమ సమావేశంలో చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాల ఉమ్మడి వైఖరిని, GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును పెంపొందించే ప్రయత్నాలను క్రమబద్ధీకరించడం గురించి షేక్ మహమ్మద్ వివరించారు. ఈ సమావేశానికి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









