బహ్రెయిన్ రాజును కలిసిన షేక్ మహమ్మద్.. పలు కీలక అంశాలపై చర్చ
- October 29, 2021యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం అబుదాబిలో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో యూఏఈ, బహ్రెయిన్ మధ్య సంబంధాలను పెంపొందించడానికి.. రెండు దేశాల ప్రజలకు ఉపయోగపడేలా కొత్త అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని ఇరు దేశాల నేతలు కొనియాడారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సాధించిన పురోగతి, కోవిడ్ -19 కాలంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చేసిన ప్రయత్నాలపై కూడా ఇరు దేశాధినేతలు తమ సమావేశంలో చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాల ఉమ్మడి వైఖరిని, GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును పెంపొందించే ప్రయత్నాలను క్రమబద్ధీకరించడం గురించి షేక్ మహమ్మద్ వివరించారు. ఈ సమావేశానికి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ