ఫ్రాన్స్లో బిజీబిజీగా కేటీఆర్..
- October 29, 2021పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు.
తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ప్యారిస్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎఫ్ బృందంతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన THub, WeHub,TWorks కు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి