ఫ్రాన్స్లో బిజీబిజీగా కేటీఆర్..
- October 29, 2021పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు.
తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ప్యారిస్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎఫ్ బృందంతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన THub, WeHub,TWorks కు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..