ఫ్రాన్స్లో బిజీబిజీగా కేటీఆర్..
- October 29, 2021
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు.
తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ప్యారిస్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎఫ్ బృందంతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన THub, WeHub,TWorks కు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









