ఖతార్ లో కర్ణాటక సంఘ్ అధ్యక్షుడ నగేష్ రావు మృతి
- October 30, 2021
దోహా: ఖతార్ లో దాదాపు 32 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు, ఖతార్ లో కర్ణాటక సంఘ్ అధ్యక్షుడు నగేష్ రావు మరణించారు. 60 ఏళ్ల ఆయన దోహాలో ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ కు తీసుకెళ్లే లోగా ఆయన చనిపోయారు. ఆయన మరణవార్త తెలియగానే ఖతార్ లోని కర్ణాటక వాసులంతా సంతాపం వ్యక్తం చేశారు. 32 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఖతార్ వచ్చిన ఆయన కష్టపడుతూ మంచి స్థాయికి వచ్చారు. హోల్ సేల్ ఫార్మసీ కంపెనీ అయిన అల్ షార్క్ ట్రేడింగ్ లో మేనేజర్ ఉన్నారు. కర్ణాటక సంఘ్ అధ్యక్షుడిగా ఎంతో మంది కన్నడిగులకు ఖతార్ లో ఏ ఆపద వచ్చిన ఆదుకున్నారు. నగేష్ రావుకు భార్య అనురాధ ఎన్ రావు, కుమారుడు ఆశిష్ ఎన్ రావు, కుమార్తె ఐశ్వర్య ఎన్ రావు ఉన్నారు. ఖతార్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆదివారం నాటికి భారత్ కు తరలించనున్నారు. నగేష్ రావు మృతిపై సౌత్ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రవాసుల ఫోరమ్ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









