పునీత్ అంత్యక్రియల కోసం బెంగళూరుకు తారక్
- October 30, 2021
హైదరాబాద్: పునీత్ రాజ్కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్కుమార్కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా కోసం తారక్ ‘గెలెయా గెలీయా’ అనే పాటను పాడారు.
పునీత్ను భౌతిక కాయాన్ని చూసేందుకు, తమ అభిమాన నటుడికి కడసారిగా నివాళులు అర్పించేందుకు కంఠీరవ స్టేడియంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా కర్ణాటకలో పునీత్ మృతి తీరని లోటు. లెజెండ్ రాజ్కుమార్ కుటుంబంతో మెగాస్టార్, నందమూరి రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







