అంతర్జాతీయ విమాన సర్వీసులపై మళ్లీ నిషేధం పొడిగింపు..
- October 30, 2021న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని శుక్రవారం డీజీసీఏ(DGCA) వెల్లడించింది.అయితే, వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద నడుస్తున్న ప్రత్యేక ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు యధావిధిగా పని చేస్తాయని డీజీసీఏ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత ఏడాది మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020 మే మొదటి వారం నుంచి వందే భారత్ మిషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంపిక చేసిన దేశాల నుంచి విమాన సర్వీసులు నడిపిస్తోంది.
అలాగే ఇదే ఏడాది జూలై నుంచి భారత్ కొన్ని దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 28 దేశాలతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా పొడిగించిన నిషేధం కారణంగా అంతర్జాతీయ కార్గో విమానాలతో పాటు ఇతర కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు