ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం

- November 06, 2021 , by Maagulf
ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం

మస్కట్:దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు కరోనా వ్యాక్సినేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది మస్కట్ ప్రభుత్వం.వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ తెలిపింది. "దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.వలీ, కురాయ్యత్ ఆఫీస్ అధికారుల సహకారంతో  వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాం. శుక్ర, శని వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల సహలె సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు "  అని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com