సైట్ వర్కర్స్ కోసం ప్రీ వాటర్ స్కీం ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- November 09, 2021
కువైట్: కువైట్ పుడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ మరొక సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైట్ లలో పనిచేసే కార్మికులకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేయనుంది. అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ తో కలిసి ఈ కొత్త సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా సైట్లలో పనిచేసే వర్కర్స్ కు చల్లని మంచి నీరు ఉచితంగా లభిస్తుంది. వర్క్ ప్లేస్ లలో ఉండే వర్కర్స్ మాత్రమే కాకుండా మసీదులు, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉచితంగా వాటర్ అందించనున్నారు. ఉచిత వాటర్ సప్లయ్ స్కీం ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని చారిటీ వైస్ చైర్మన్ మెషల్ అల్ అన్సారీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ ప్రయత్నిస్తుందన్నారు. అటు అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ వారు వాటర్ సప్లయ్ చేసేందుకు వాలంటీర్ల సేవలను అందించనున్నారు. ఫ్రీ వాటర్ సప్లయ్ కారణంగా వేలాది మంది వర్కర్స్ కు మేలు జరగనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









