సైట్ వర్కర్స్ కోసం ప్రీ వాటర్ స్కీం ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- November 09, 2021
కువైట్: కువైట్ పుడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ మరొక సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైట్ లలో పనిచేసే కార్మికులకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేయనుంది. అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ తో కలిసి ఈ కొత్త సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా సైట్లలో పనిచేసే వర్కర్స్ కు చల్లని మంచి నీరు ఉచితంగా లభిస్తుంది. వర్క్ ప్లేస్ లలో ఉండే వర్కర్స్ మాత్రమే కాకుండా మసీదులు, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉచితంగా వాటర్ అందించనున్నారు. ఉచిత వాటర్ సప్లయ్ స్కీం ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని చారిటీ వైస్ చైర్మన్ మెషల్ అల్ అన్సారీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ ప్రయత్నిస్తుందన్నారు. అటు అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ వారు వాటర్ సప్లయ్ చేసేందుకు వాలంటీర్ల సేవలను అందించనున్నారు. ఫ్రీ వాటర్ సప్లయ్ కారణంగా వేలాది మంది వర్కర్స్ కు మేలు జరగనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







