సైట్ వర్కర్స్ కోసం ప్రీ వాటర్ స్కీం ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్

- November 09, 2021 , by Maagulf
సైట్ వర్కర్స్ కోసం ప్రీ వాటర్ స్కీం ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్

కువైట్: కువైట్ పుడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ మరొక సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైట్ లలో పనిచేసే కార్మికులకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేయనుంది. అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ తో కలిసి ఈ కొత్త సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా సైట్లలో పనిచేసే వర్కర్స్ కు చల్లని మంచి నీరు ఉచితంగా లభిస్తుంది. వర్క్ ప్లేస్ లలో ఉండే వర్కర్స్ మాత్రమే కాకుండా మసీదులు, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉచితంగా వాటర్ అందించనున్నారు.  ఉచిత వాటర్ సప్లయ్ స్కీం ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని చారిటీ వైస్ చైర్మన్ మెషల్ అల్ అన్సారీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ ప్రయత్నిస్తుందన్నారు. అటు అవ్ కఫ్ పబ్లిక్ ఫౌండేషన్ వారు వాటర్ సప్లయ్ చేసేందుకు వాలంటీర్ల సేవలను అందించనున్నారు. ఫ్రీ వాటర్ సప్లయ్ కారణంగా వేలాది మంది వర్కర్స్ కు మేలు జరగనుంది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com