భారత రాయబారి పవన్ కపూర్ పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు
- November 10, 2021
అబుధాబి: యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తన కార్యాలయంలో పవన్ కపూర్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. భారత్-యూఏఈ సంబంధాలను పెంపొందించడంలో భారత రాయబారిగా కపూర్ చేసిన కృషిని, విశిష్ట సహకారాన్ని ప్రశంసించారు. తన పదవీ కాలం విజయవంతం అయ్యేందుకు సహకారం, మద్దతు అందించిన యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత రాయబారి పవన్ కపూర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









