కరోనా ఆంక్షల సడలింపు. మసీదులలో మహిళలకు ప్రార్థన చేసుకునే అవకాశం

- November 10, 2021 , by Maagulf
కరోనా ఆంక్షల సడలింపు. మసీదులలో మహిళలకు ప్రార్థన చేసుకునే అవకాశం

యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో మహిళలకు ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను తిరిగి ఓపెన్ చేయనుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతేడాది జులైలో ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను మూసివేశారు. ప్రేయర్ కు వచ్చే మహిళలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మసీదులో 1.5 మీటర్ల డిస్టెన్స్ మెయింటెన్ చేయటంతో పాటు ప్రేయర్స్ కు ముందు, తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపింది. కరోనా సేప్టీ మెజర్స్ పంప్లైట్స్ ను ఇంగ్లీష్, అరబ్, ఉర్దూ భాషల్లో అన్ని మసీదుల్లో అందుబాటులో ఉంచాలని కోరింది. ఇమామ్స్, మసీదుల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని నిబంధన పెట్టింది. ఇక ప్రార్థనలు పూర్తైన వెంటనే అన్ని మసీదుల్లో శానిటైజేషన్ చేస్తామని నేషనల్ క్రైసెస్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com