కరోనా ఆంక్షల సడలింపు. మసీదులలో మహిళలకు ప్రార్థన చేసుకునే అవకాశం
- November 10, 2021యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో మహిళలకు ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను తిరిగి ఓపెన్ చేయనుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతేడాది జులైలో ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను మూసివేశారు. ప్రేయర్ కు వచ్చే మహిళలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మసీదులో 1.5 మీటర్ల డిస్టెన్స్ మెయింటెన్ చేయటంతో పాటు ప్రేయర్స్ కు ముందు, తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపింది. కరోనా సేప్టీ మెజర్స్ పంప్లైట్స్ ను ఇంగ్లీష్, అరబ్, ఉర్దూ భాషల్లో అన్ని మసీదుల్లో అందుబాటులో ఉంచాలని కోరింది. ఇమామ్స్, మసీదుల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని నిబంధన పెట్టింది. ఇక ప్రార్థనలు పూర్తైన వెంటనే అన్ని మసీదుల్లో శానిటైజేషన్ చేస్తామని నేషనల్ క్రైసెస్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?