కరోనా ఆంక్షల సడలింపు. మసీదులలో మహిళలకు ప్రార్థన చేసుకునే అవకాశం
- November 10, 2021
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో మహిళలకు ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను తిరిగి ఓపెన్ చేయనుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతేడాది జులైలో ఉమెన్స్ ప్రేయర్ హాల్స్ ను మూసివేశారు. ప్రేయర్ కు వచ్చే మహిళలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మసీదులో 1.5 మీటర్ల డిస్టెన్స్ మెయింటెన్ చేయటంతో పాటు ప్రేయర్స్ కు ముందు, తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపింది. కరోనా సేప్టీ మెజర్స్ పంప్లైట్స్ ను ఇంగ్లీష్, అరబ్, ఉర్దూ భాషల్లో అన్ని మసీదుల్లో అందుబాటులో ఉంచాలని కోరింది. ఇమామ్స్, మసీదుల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని నిబంధన పెట్టింది. ఇక ప్రార్థనలు పూర్తైన వెంటనే అన్ని మసీదుల్లో శానిటైజేషన్ చేస్తామని నేషనల్ క్రైసెస్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









