'ఖిలాడీ' విడుదల తేదీ ఖరారు
- November 11, 2021హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ "ఖిలాడి". సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. ఎ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022న ఖిలాడీ తెరపైకి రానుందని మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన రూపంలో కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా