ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయం: సైఫ్
- November 13, 2021
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ .. అమృత సింగ్ నుండి విడిపోయి కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు అమృత సింగ్ తో ఇద్దరు పిల్లలు సంతానం కాగా, వారి పేర్లు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అమృత సింగ్. ఇక కరీనాని 2012లో పెళ్లి చేసుకున్న సైఫ్.. తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు చిన్నారులకి జన్మనిచ్చారు. అయితే సైఫ్ ప్రస్తుతం బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా కపిల్ శర్మ కోసం రాణీ ముఖర్జీతో కలిసి హాజరైన సైఫ్.. అదిరిపోయే పంచ్ వేసి అందరిని నవ్వించాడు. మీకు పనిమీద ప్రేమ ఎక్కువై ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారా ? లేక పిల్లలు పుడుతుండడం, ఫ్యామిలీ బాధ్యతల వల్ల సినిమాలు చేస్తున్నారా అని కపిల్ ప్రశ్నించాడు. దీనికి సైఫ్ సమాధానం ఇస్తూ.. ‘ ఫ్యామిలీ కోసం కాదు కానీ.. ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమో అని భయంగా ఉంది.. అందుకే వర్క్ తో బిజీ అయిపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









