బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
- November 13, 2021నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
చిత్ర యూనిట్ మొత్తం లాంచ్కి హాజరయ్యారు. ముహూర్తం షాట్కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్ని టీమ్కి అందజేశారు. జనవరి 2022లో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'జై బాలయ్య' అనే టైటిల్ ఖరారు చేయగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్