తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలిచిన కాశీ విశ్వనాథ్
- November 15, 2021హైదరాబాద్: నవంబర్ 14వ తేదీ ఆదివారం తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి.ఇందులో దర్శకుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. అత్యధిక మంది సభ్యులు ఆయన ప్యానెల్ నుండి ఎన్నిక కావడం విశేషం.ఇక సముద్ర, చంద్రమహేశ్ ప్యానెల్స్ నుండి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు.మహిళా రిజర్వేషన్ కోటాలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వి.ఎన్. ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్. రావు; సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు; కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లా బక్ష్, పి. వి. రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ.ప్రేమ్ రాజ్, నీలం సాయి రాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు.మహిళల కేటగిరిలో సౌజన్య, ప్రవీణలను ఎంపిక చేశారు. ఈ నూతన కార్యవర్గం ఈ నెల 18న ప్రమాణస్వీకారం చేయనుంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి