ఫంగస్ తో మా హాస్పిటల్ లో ఎవరు చనిపోలేదు-ఎస్ఎంసీ
- November 16, 2021
బహ్రెయిన్:క్యాండిడా అరిస్ ఫంగస్ తో తమ హాస్పిటల్ లో ఓ పేషెంట్ చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) యాజమాన్యం తెలిపింది. ఫంగస్ కారణంగా ఈ హాస్పిటల్ లో ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.దీంతో హాస్పిటల్ మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.సదరు పేషెంట్ ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ కారణంగానే చనిపోయాడని స్పష్టం చేశారు.క్యాండిడా అరిస్ ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ ఫెక్షన్ బయటకి కనబడుతుందని...దాని కావాల్సిన ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ తమ వద్ద ఉన్నాయని తెలిపారు.ఫంగస్ కు సంబంధించిన వార్తలు రావటంతో హాస్పిటల్ లో ఉన్న చాలా మంది పేషెంట్లను టెస్ట్ చేశామని వారికి ఎలాంటి క్యాండిడా అరిస్ ఫంగస్ లక్షణాలు లేవని తెలిపారు.కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వార్తలు నమ్మవద్దని హాస్పిటల్ మేనేజ్ మెంట్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







