ఫంగస్ తో మా హాస్పిటల్ లో ఎవరు చనిపోలేదు-ఎస్ఎంసీ
- November 16, 2021
బహ్రెయిన్:క్యాండిడా అరిస్ ఫంగస్ తో తమ హాస్పిటల్ లో ఓ పేషెంట్ చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) యాజమాన్యం తెలిపింది. ఫంగస్ కారణంగా ఈ హాస్పిటల్ లో ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.దీంతో హాస్పిటల్ మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.సదరు పేషెంట్ ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ కారణంగానే చనిపోయాడని స్పష్టం చేశారు.క్యాండిడా అరిస్ ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ ఫెక్షన్ బయటకి కనబడుతుందని...దాని కావాల్సిన ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ తమ వద్ద ఉన్నాయని తెలిపారు.ఫంగస్ కు సంబంధించిన వార్తలు రావటంతో హాస్పిటల్ లో ఉన్న చాలా మంది పేషెంట్లను టెస్ట్ చేశామని వారికి ఎలాంటి క్యాండిడా అరిస్ ఫంగస్ లక్షణాలు లేవని తెలిపారు.కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వార్తలు నమ్మవద్దని హాస్పిటల్ మేనేజ్ మెంట్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







