ఒమన్ 51 నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా మస్కట్ గవ్నర్ విందు
- November 22, 2021
మస్కట్: ఒమన్ 51 వ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మంత్రులకు, అధికారులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. మస్కట్ లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మాట్లాడారు. అందరికీ 51 వ నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఒమన్ ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఒమన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని...ఆయన పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో పలువురు మంత్రులు, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మెంబర్లు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ సభ్యులు, సెక్రటరీలు, సీనియర్ మిలిటరీ కమాండర్లు, మస్కట్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!









