బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ
- November 25, 2021కువైట్: బయోమెట్రిక్ హాజరు నిబంధనలను పాటించనందుకు సమాచార మంత్రిత్వ శాఖ 207 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేసింది. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) జారీ చేసిన సూచనల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థకు విఘాతం కలిగించడం లాంటి చర్యలను మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో గుర్తించారు. ఈ గందరగోళం కారణంగా ఉద్యోగుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగా CSC సమన్వయంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పాటించాల్సిందేనని రెగ్యులేటరీ అధికారుల చేసిన సిఫార్సుల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు సిస్టంను CSCతో అనుసంధానించలేదని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని...ఆ కారణంగానే లేటుగా వస్తున్నారని అధికారులు గుర్తించారు. కానీ CSCతో బయోమెట్రిక్ అనుసంధానం ఎప్పుడు జరిగిపోయిందని ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అధికారులు కోరారు. అటు కొందరు ఉన్నత ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ నివేదికలో తెలిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక