బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ
- November 25, 2021కువైట్: బయోమెట్రిక్ హాజరు నిబంధనలను పాటించనందుకు సమాచార మంత్రిత్వ శాఖ 207 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేసింది. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) జారీ చేసిన సూచనల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థకు విఘాతం కలిగించడం లాంటి చర్యలను మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో గుర్తించారు. ఈ గందరగోళం కారణంగా ఉద్యోగుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగా CSC సమన్వయంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పాటించాల్సిందేనని రెగ్యులేటరీ అధికారుల చేసిన సిఫార్సుల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు సిస్టంను CSCతో అనుసంధానించలేదని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని...ఆ కారణంగానే లేటుగా వస్తున్నారని అధికారులు గుర్తించారు. కానీ CSCతో బయోమెట్రిక్ అనుసంధానం ఎప్పుడు జరిగిపోయిందని ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అధికారులు కోరారు. అటు కొందరు ఉన్నత ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ నివేదికలో తెలిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్