ఈ ఏడాది చివరికల్లా..అంతర్జాతీయ విమాన సర్వీసులు!
- November 25, 2021న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు.కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ కు తరలించేందుకు,అత్యవసర సరుకుల రవాణా కోసం ప్రభుత్వం కొన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం,వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..