భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 26, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో 11,81,246 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,549 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,55,431కి చేరింది.నిన్న ఒక్క రోజే 488 మంది మరణించారు.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,67,468కి చేరింది.
నిన్న 9,868 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,39,77,830కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.33 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 83,88,824 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,20.22,33,565 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…