భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 26, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో 11,81,246 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,549 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,55,431కి చేరింది.నిన్న ఒక్క రోజే 488 మంది మరణించారు.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,67,468కి చేరింది.
నిన్న 9,868 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,39,77,830కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.33 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 83,88,824 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,20.22,33,565 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..