15 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం
- November 26, 2021
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని శుక్రవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.కేంద్రహోంశాఖ,ఆరోగ్యశాఖ,విదేశాంగశాఖతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.కాగా,గత వారం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా..అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి(కోవిడ్ పూర్వ స్థితికి) తీసుకొచ్చే ప్రక్రియపై కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఇక,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు,కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆంక్షలను ఎదుర్కొన్న దేశీయ విమాన సేవలు..గత నెల నుంచి పూర్తిస్థాయిలో అనుమతించబడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!