ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం
- November 27, 2021న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనది కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతుందని వస్తున్న వార్తలపై ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన చర్చించబోతున్నారు. కొత్త వేరియంట్తో పాటుగా వ్యాక్సినేషన్పై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!