ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కార్మికులకు బూస్టర్ డోసులపై అవగాహన కార్యక్రమాలు
- November 29, 2021బహ్రెయిన్: ప్రపంచవ్యాప్తంగా COVID-19 కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బహ్రెయిన్ లేబర్ డిపార్ట్మెంట్, సోషల్ డేవలప్మెంట్ మినిస్ట్రీ అలెర్ట్ అయ్యాయి. లేబర్ క్యాంపుల వద్ద కరోనావైరస్ నివారణ ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేశాయి. దీంతో పాటు వివిధ వైరస్ వేరియంట్ల నుంచి రక్షణకు కార్మికులు వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నాయి. మొదటి దశ ప్రచారంలో భాగంగా 27,340 ట్రేడింగ్ అవుట్లెట్లు, 8,277 పారిశ్రామిక సంస్థలు, 6,695 నిర్మాణ సంస్థలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వర్క్సైట్లు, లేబర్ క్యాంపుల వద్ద అన్ని ముందస్తు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేబర్ మినిస్ట్రీ కోరింది. ఈ మేరకు ఇన్స్పెక్షన్ అండ్ ప్రొఫెషనల్ సేఫ్టీ డైరెక్టరేట్ వర్క్సైట్లు, లేబర్ క్యాంపుల వద్ద పాటించాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ తెలిపే వివిధ భాషల్లోముద్రించిన ప్రచార పోస్టర్లను పంపిణీ చేస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు