ఒమిక్రాన్ అలర్ట్: అర్థరాత్రి నుంచి కొత్తరూల్స్...
- November 30, 2021న్యూ ఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది.దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది.దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది.జపాన్లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది.కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్ను తీసుకొచ్చింది.రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు.ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్పోర్ట్లోనే వేచి ఉండాలి. నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్లో ఉండాలి.
ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తరువాత 8వ రోజు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలి.అప్పుడు కూడా నెగిటివ్ వస్తే బయటకు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్గా తేలితే వారిని సపరేట్గా క్వారంటైన్కు తరలిస్తారు. వారి శాంపిల్స్ను INSACOG ల్యాబ్ కు పంపి జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేయిస్తారు.ఒకవేళ అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలితే వారిని సాధారణ కరోనా చికిత్సను అందిస్తారు.అదే ఒమిక్రాన్ పాజిటివ్గా తేలితే ప్రత్యేకమైన చికిత్సను అందిస్తారు. యూకేతో పాటు అధిక రిస్క్ ఉన్న 44 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు దృష్టి సారించారు.కేంద్రం విడుదల చేసిన కొత్త రూల్స్ ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..