ఘంటసాల శతజయంతి ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉంది: సావిత్రమ్మ
- December 04, 2021
విజయవాడ: మరపురాని మధురగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ‘ఘంటసాల శతజయంతి ఉత్సవాలను’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంకల్పించారు. ఈ విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సావిత్రమ్మ. ఆమె అనారోగ్య కారణంగా ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపగా, ఆమె సందేశాన్ని ఘంటసాల రెండవ కూతురు సుగుణ చదివి వీడియో ద్వారా పోస్ట్ చేశారు. తెలుగునేలపై జన్మించిన ఘంటసాల దక్షిణాది సంగీతాభిమానులందరికీ ఆనందం పంచారు. ఆయన తెలుగువారయినందుకు తెలుగుజాతి గర్విస్తోంది. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించడం పట్ల కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఘంటసాలపై ఓ ప్రత్యేక సావనీర్ ను ప్రభుత్వం వెలువరుస్తోంది.
1922 డిసెంబర్ 4న కృష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల వేంకటేశ్వరరావు విజయనగరంలో సంగీతాభ్యాసం చేశారు. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో చిత్రసీమలో రాణించారు.‘కీలుగుర్రం, మనదేశం’ చిత్రాలకు సంగీతం సమకూరుస్తూ సంగీత దర్శకులయ్యారు. ‘పాతాళభైరవి’ ఘనవిజయంతో ఘంటసాల జైత్రయాత్ర మొదలయింది. అప్రతిహతంగా రెండున్నర దశాబ్దాల పాటు ఘంటసాల గానలీల సాగింది. ఇలాంటి ఘంటసాల గానప్రస్థానంలోని పలు విశేషాలు సావనీర్ లో చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు