భారత్లో కరోనా కేసుల వివరాలు
- December 07, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,79,384 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,822 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,48,383కి చేరింది. నిన్న ఒక్క రోజే 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,73,757కి చేరింది.
నిన్న10,004 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,40,79,612కి చేరింది. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది.నిన్న 79.3లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 128.76కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..