‘కె.జి.ఎఫ్ -2’ డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్!
- December 07, 2021
ముంబై: పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని చాలామంది ‘బాహుబలి’తో పోల్చారు. ఆ మూవీ సరసన నిలబడదగ్గ చిత్రంగా కొనియాడారు. కన్నడంతో పాటు అప్పట్లోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్.’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘బాహుబలి’ తరహాలోనే దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘చాప్టర్ -2’ షూటింగ్ కొద్ది భాగమే బాలెన్స్ పెట్టుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ మాత్రం షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో చాప్టర్ -2లో అధీరా పాత్ర పోషించిన సంజయ్ దత్ సైతం అనారోగ్యం పాలు కావడంతో మరికొంత ఆలస్యమైంది.
ఎట్టకేలకు ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ షూటింగ్ ను ఆ మధ్య పూర్తిచేసిన ప్రశాంత్ నీల్, డబ్బింగ్ కార్యక్రమాలూ మొదలు పెట్టేశాడు. అందులో భాగంగానే బాలీవుడ్ క్రేజీ యాక్టర్ సంజయ్ దత్ తోనూ డబ్బింగ్ చెప్పించాడు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేశాడు. సంజయ్ దత్ డబ్బింగ్ సెషన్ పూర్తి అయినట్టు అందులో ప్రకటించాడు. యశ్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రామచంద్రరాజు, అనంత్ నాగ్, మాళవిక అవినాశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ వరల్డ్ వైడ్ వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







