‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ పూర్తి!
- December 07, 2021
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ, నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించబోతున్నాడని, పాయల్ రాజ్పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ తెలిపాడు. పాయల్ పాత్ర అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా అందరినీ ఆకట్టుకోనుందని అన్నారు. గోవాలో ఇటీవల ఆది సాయికుమార్, పాయల్ పై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు